పహల్గాం దాడిని ఖండిస్తూ నందిపేటలో ముస్లింల శాంతి ర్యాలీ
నందిపేట, బతుకమ్మ : కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, నందిపేట మండల కేంద్రంలో ముస్లింలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జమే మసీద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో “పాకిస్తాన్ డౌన్ డౌన్”, “టెరరిజం నాశించాలి”, “ఇండియా జిందాబాద్”, “హిందూ ముస్లిం భాయీ భాయీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ—దేశంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న...