ప్రారంభమైన మున్సిపల్ ఓట్ల లెక్కింపు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :    మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు.