1వ వార్డులో ఇంటింటి సర్వే చేపట్టిన మున్సిపల్ అధికారులు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలో గల 1వ వార్డులోని ఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేను గురువారం మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల యొక్క వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లి కార్టున్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అమర్ చావుస్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.