Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 3:09 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి లో ఎమ్మార్పిఎస్ నిరసన దీక్ష

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పిఎస్ నాయకులు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.వారు మాట్లాడుతూ..చట్టభద్దత కల్పించాకే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను కాలయాపన చేయడం సరి కాదని మండిపడ్డారు.ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేయాలనీ కోరారు.ఈ దీక్ష కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు సతీష్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పిఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.