పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో లక్ష్మణ్
మెండోరా, బతుకమ్మ: రాబోయే ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మెండోరా ఎంపీడీవో లక్ష్మణ్ వార్డ్ వైజ్ సోన్ పేట్, పోచంపాడ్ దూదిగం గ్రామాల్లో గల కేంద్రాలను పరిశీలించారు. పరిశీలనతో పాటు కావలసిన అవసరతలను గ్రామాల సెక్రటరీలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో గ్రామాల కార్యదర్శిలు భరత్ కుమార్, శ్రీనివాస్, శ్యామ్, గ్రామాల బీ ఎల్ ఓ ఎస్ ప్రసాద్, భూలక్ష్మి, గంగామణి, కమల, రోజహెలెన్, సోనీ తదితరులు పాల్గొన్నారు.