Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 5:04 pm Posted by : ramakrishna

ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం  నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యపరిచి సంక్షేమ పథకాలను వివరించి ఎన్నికలలో విజయం సాధించాలని అన్నారు.