Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 3:47 pm Posted by : ramakrishna

కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

న్యూఢిల్లీ, బతుకమ్మ: కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పట్టణాల అభివృద్ధి, పురోగతిపై చర్చించారు. వారివెంట జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జ్యోతీలక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకుడు మోరేపల్లి సత్యనారాయణ తదితరులున్నారు.

MP, MLA meet with Secretary, Ministry of Housing