నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీ సీఏం రేఖ గుప్తాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీ సచివాలయంలోని ఆమె కార్యాలయంలో శుక్రవారం కలిశారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట బీజేపీ సీనియర్ నాయకులు మోరేపల్లి సత్యనారాయణ ఉన్నారు.
