నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జనగణన 2027 లో భాగంగా ఎంపీ అర్వింద్ స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ కి సెల్ఫ్ ఎన్యూమరేషన్పై అవగాహన కల్పించి, ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ ప్రదీప్ కుమార్, తహసీల్దార్ బాలరాజ్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
