‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక వీడియోను పోస్ట్
వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ’దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని.. అభివృద్ధి చెందిన భారత దేశంగా రూపొందేందుకు శక్తినివ్వాలని శివుడిని వేడుకుంటూ‘ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా, మోదీ పోస్ట్ చేసిన వీడియో యూజర్లను ఆకట్టుకుంటోంది.