29 నుంచి జపాన్, చైనాలలో మోదీ పర్యటన

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలలో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.  ఈనెల 29 నుంచి 30 వరకు 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో నరేంద్రమోదీ పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ జపాన్‌ లో పర్యటించబోవడం ఎనిమిదవసారి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై  సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో మోదీ చేసే ఈపర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.