విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గోన్న కవిత
రెంజల్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. మండలం లో సాటాపూర్ గ్రామంలో సీతారామాలయం లో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం గ్రామస్థులు కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
