కరీంనగర్, బతుకమ్మ :
కరీంనగర్ , నిజామాబాద్ , ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతుంది. సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మంగళవారం ఉదయం వరకు 2 లక్షల 10 వేల ఓట్లు లెక్కించారు .

ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40 వేల ఓట్ల ప్రాథమిక లెక్కింపు విభజన జరిగింది. వాటి కారణంగా ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ అలస్యంగా ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 21 టేబుల్ లలో కొనసాగుతుంది.
