ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి తరలిరావాలి

బాన్సువాడ, బతుకమ్మ  : పట్టణంలో బుధవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి రానున్నట్లు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తెలిపారు. పోతంగల్ మండలానికి చెందిన ఎమ్మెల్సీ ఓటు కల్గిన వారు, నాయకులు. కార్యకర్తలు. అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్, విఠల్, దాసరి శ్రీనివాస్, ప్రసాద్, గౌస్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.