హైదరాబాద్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, రవీందర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలతో పాటు వ్యవహార శైలి తీరుపై బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు కల్వకుంట్ల కవితను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటన వెలువడింది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన కవిత కాలేశ్వరంపై సిబిఐ విచారణ మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావులతోపాటు ఇతరులు కారణమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత సస్సెన్షన్ వ్యవహారం రాజకీయరంగంలో చర్చనీయాంశంగా మారింది.
