స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వేముల

నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ నవమి సందర్భంగా పోచంపాడ్ కోదండ రామాలయం లో స్వామి వారి కల్యాణోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అన్నదానం కోసం బియ్యం,కిరాణా సామగ్రి వితరణ చేశారు. అన్నదాన సత్రంలో  భక్తులకు కాసేపు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు.