Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 7:50 pm Posted by : ramakrishna

రైతులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖాముఖి

 బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజక వర్గ  రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కూరగాయల పంటల సాగు వాటిపై ప్రభుత్వం అందించే రాయితీలపై రైతులతో చర్చించారు. రైతులు పంట సాగుకై ఆమోదిస్తూ తమ పేర్లను నమోదు చేసుకోగా అందుకు సంబంధించిన రాయితీపై రుణ సదుపాయం చెక్కుల పంపిణీకై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ  కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ గడువు గంగాధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి, ఏసిపి శ్రీనివాస్, సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు ఏఎంసీ కమిటీ సభ్యులు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

MLA Sudarshan Reddy interview with farmers