ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ, బతుకమ్మ : బాధితుడికి  మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ వోసి అందజేశారు. ముప్కాల్ మండల కేంద్రానికి  చెందిన గడాల చంద్రయ్య క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాధితుడుకి రూ.1.10 లక్షల ఎల్వోసిని మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన కాపీని గురువారం హైదరాబాద్ లో బాధిత కుటుంబ సభ్యులకు ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈసందర్భంగా ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.