Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 11:11 am Posted by : ramakrishna

గిరిజన బాలికల గురుకుల పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మేల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, బతుకమ్మ:

నసారుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో గల  గిరిజన బాలికల గురుకుల పాఠశాల ను ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఆకస్మిక తనిఖీ  చేసి మౌలిక వసతుల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలతో  మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం విద్యాబోధన పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి విధి నిర్వహణలో పాఠశాల ఆవరణ లో మృతి చెందిన ఉపాధ్యాయురాలు శ్రీమతి మామిడి స్వప్న మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ప్రజాప్రతినిధులు నాయకులు పోచారం వెంట ఉన్నారు

MLA Pocharam Srinivas Reddy conducted a surprise inspection of a tribal girls' school