Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 5:23 pm Posted by : ramakrishna

జనాభా లెక్కల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 

. . . ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

2027 జనాభా లెక్కలకు సంబంధించి జనగణన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిర్వహించిన సర్వే లో ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్యుమ్యూరేటర్ కార్తీక్ గూపన్ పల్లి అశోక్ టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి పలు వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు. స్వచ్ఛందంగా జనగణనకు సహకరించిన ఎమ్మెల్యే… ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

MLA Dr. R. Bhupathi Reddy participated in the census