హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి ని సెక్రటేరియట్లోని కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి, శాలువా తో సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఐసీ డి ఏం ఎస్ మాజీ చైర్మన్ మునిపల్లిసాయరెడ్డి, మాజీఎంపీపీ రాజన్న, మాజీసర్పంచ్ చిన్నసాయరెడ్డి ,శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.