అఖండ హరినామ సప్తాహంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్ లోని విఠలేశ్వర్   నగర్ లో నిర్వహిస్తున్న “అఖండ హరినామ సప్తాహ” కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ భక్తులతో కలిసి భజనలు, హరినామ సంకీర్తనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ  భక్తి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో సద్భావన, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు సనాతన ధర్మ విలువలను తెలియజేయడంలో...