ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని సిర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఐసి గంగాధర్ తల్లి ఇటీవల మరణించడంతో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని సంఘటనలు మనకు తెలియకుండానే జరుగుతాయని దీనికి అధైర్యపడవద్దని వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, ఇందల్వాయి మాజీ సర్పంచ్ అరిపల్లి దశరథ్ నారాయణ,వసంతరావు, మోతిలాల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.