బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ 

ఢిల్లీ, బతుకమ్మ :  బీసీసీఐ అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ పదవి ఏర్పడ్డ  విషయం తెలిసిందే.  45 ఏళ్ల  మన్హాస్ ఢిల్లీ తరపున 157 మ్యాచులు, ఐపీఎల్ 55 మ్యాచులు ఆడాడు.  భారత జట్టు తరఫున ఎప్పుడూ ఆడలేదు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘంలో మన్హాస్  పాలకుడిగా పని చేశాడు.