మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల అడ్మిషన్లు ప్రారంభం

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ కేంద్రంలో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభించామని బుధవారం ప్రిన్సిపల్ నా హేదా ఫిల్టోస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26 విద్య సంవత్సరానికి గాను ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఆర్మూర్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాల కోసం 7995057941 సంప్రదించాలని తెలిపారు.