హైదరాబాద్ కు తరలిన మైనారిటీ ఉద్యోగులు
బాన్సువాడ, బతుకమ్మ : హైదరాబాద్లో శనివారం నిర్వహించిన మైనారిటీ ఉద్యోగుల సంఘం సమావేశానికి బాన్సువాడ డివిజన్ తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఎస్ మెసా) సభ్యులు తరలి వెళ్లారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ కు తరలివెళ్లిన వారిలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ వాహబ్, సయ్యద్ హాజీ, సయ్యద్ అబ్దుల్ రజాక్, ఖలీల్, మొహమ్మద్ అక్బర్, అమేర్, బాబుఖాన్, అబ్రార్, మసూద్, హఫీస్, సయ్యద్ ఇమ్రాన్, బిలాల్ తదితరులు ఉన్నారు.