Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 3:46 pm Posted by : ramakrishna

మంత్రి పొన్నం ప్రభాకర్ బేషతుగా క్షమాపణ చెప్పాలి

  • టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంత్రి పొన్నం ప్రభాకర్ బేషతుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని  టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంత్రుల ప్రెస్ మీట్ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనూచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  ఎక్కడికక్కడ అడ్డుకుంటాం.. మీ ఇల్లును ముట్టడిస్తాం.. నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త, మాదిగ జాతి ఓట్లతోనే నువ్వు మంత్రివి అయ్యావు అని హెచ్చరించారు.