Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 12:24 pm Posted by : ramakrishna

22 కోట్ల డబుల్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ధర్పల్లి, బతుకమ్మ:

ధర్పల్లి మండలం నల్లవెల్లి గ్రామంలో ప్రభుత్వం రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించు డబుల్ రోడ్ల పనులకు  రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భూమి పూజ చేశారు. స్టేషన్ తాండా నుంచి లింగాపుర్ స్టేజీ వరకు రూ.18 కోట్లు, మల్లయ్య గుడి నుంచి మేగ్యా నాయక్ తాండా వరకు రూ.4 కోట్ల వ్యయం  తో నిర్మించు పనులకు స్థానిక శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి తో కలిసి శుక్రవారం ఉధయం మంత్రి కోమటి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు, ఉర్థు అకాడమి చైర్మెన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు పాల్గోన్నారు.

Minister Komati Reddy Venkat Reddy laid the foundation stone for the works of 22 crore double roads