నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ విడుదల చేయాలని, సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. నిజామాబాద్ లోని మండల విద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఎంఈఓ ఆర్ వి ఎన్ గౌడ్, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ ఎబినేజర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రభాకర్, శ్వేత, సీఆర్పీలు సుమలత, షఫీ, అప్సర్, చిన్నయాలతో పాటు సాయికిరణ్ పాల్గొన్నారు.