Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 8:56 pm Posted by : ramakrishna

హిందూ సంఘాల ఆధ్వర్యంలో మైక్ సెట్  ఏర్పాటు

 

భిక్కనూరు, బతుకమ్మ

 

భిక్కనూరు మండల కేంద్రంలో గాంధీ విగ్రహం, జండా గల్లి, కుమ్మరి గల్లి ప్రాంతంలో మొత్తం 10 మైక్ సెట్ లను శనివారం ఏర్పాటు చేశారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ప్రతిరోజు గంట గంటకు సమయం చెప్పడం తో పాటుగా భక్తి గీతాలు ప్రతి ఒక్కరూ వినాలన్న ఉద్దేశంతో దాతల సహకారంతో మైక్ సెట్ లను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హిందూ సంఘాలను పట్టణ ప్రజలు అభినందించారు. హిందువులందరూ ఐక్యతతో సమాజంలో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. జై శ్రీరామ్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.