Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 6:52 pm Posted by : ramakrishna

మేరు కులస్తుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతా

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

టైలర్స్ పని చేసుకునే మేరు కులస్తులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనేత్తుతనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు.  జాతీయ టైలర్స్ డేను పురస్కరించుకుని శుక్రవారం మేరు టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదర్శనగర్ మేరు సంఘంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సాహించే విదంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ధ్వరా కుల వృత్తులు చేసుకునేవారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగలు, శిక్షణ సమయంలో 500 ఉపకారవేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. పనిముట్లు ఇతర పరికరాలకు ఎటువంటి పూచి కత్తు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మేరు కులావృత్తులు చేసుకునే వారికీ ఉచిత కరెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Meru caste issues will be raised in the assembly

మేరు కుల కార్పొరేషన్ ఏర్పాటుకు పరిమితం కాకుండా మేరు కుల సంఘం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని,మేరు కుల వృత్తులు చేసుకునే వారికీ ప్రభుత్వం చొరవ తీసుకోని 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు.అలాగే 50 ఏళ్ళు పై బడిన మేరు సోదరులకు పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని,బట్టలు కుట్టే దర్జీ సోదరి, సోదరిమనులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని  ప్రభుత్వాలు చేపట్టి కుల వృత్తులు చేసుకునే వారికీ చేయూతనివ్వాలని అన్నారు. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్బంగా కుల వృత్తి చేసుకునే వారికీ ధన్ పాల్ లక్ష్మి బాయ్, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగ కిషన్, జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు,  ప్రధాన కార్యదర్శి కొట్టూర్ దేవదాస్, కోశాధికారి చంద్రకాంత్, మాజీ కార్పొరేటర్లు గడుగు రోహిత్, ఎర్రం సుదీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Meru caste issues will be raised in the assembly