Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 6:29 pm Posted by : ramakrishna

యోగా వల్లనే మానసిక దృడత్వం

 

. . . ఫ్యూచర్ లైన్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రియాంక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యోగా సాధన ద్వారా మనిషి శారీరకంగా దృఢంగా మారడంతో పాటు మానసిక ఉత్తేజం, ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని ఫ్యూచర్ లైన్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రియాంక పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని ఫ్యూచర్ లైన్ కిడ్స్ స్కూల్‌లో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సులభమైన, సమర్థవంతమైన సాధనమని ప్రిన్సిపాల్ ప్రియాంక తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లావణ్య, సుమలత, గౌతమి, మాధవి, శిరీషలు సమన్వయకర్తలుగా వ్యవహరించి విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా పట్ల తమ ఆసక్తిని చాటుకున్నారు.

 

Mental strength comes from yoga.