నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నగరం లోని బాపూజీ వచనలయ కార్యదర్శి గా సోమవారం మీసాల సుధాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా వచనాలయ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నికి ముఖ్య అతిధిగా ఉర్దూ అకాడమి చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ హాజరై మాట్లాడుతూ మీసాల సుధాకర్ రావుది చిన్నపాటి నుంచి కష్టపడే తత్వం అన్నారు. రాజకీయాల కు అతితంగా అందరితో కల్పుకొని వెళ్లే మనసత్వం అన్నారు. ఈ యొక్క వచనాలయం లో అనేక సంవత్సరాల నుండి సభ్యుడిగా సేవ చేయడం జరిగుతుంది అన్నారు. కార్యదర్శి గా బాధ్యత లు స్వీకరించడం మాకు ఆనందంగా ఉందన్నారు. సుధాకర్ తో మేము ఎపుడు మాట్లాడిన ఈ సంస్థ కు మీ సహకారం ఉండాలని కోరే వాడని అన్నారు. అదే విదంగా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కష్టపడి నూతన భవనన్ని పూర్తి చేయాలనీ అన్నారు. తెలంగాణ లో నే నిజామాబాదు నగరానికి ఈ లైబ్రరీతో పేరు తీసుకోని రావాలని అకాడమీ చెర్మన్ తాహేర్ బిన్ హందన్ కోరారు. అదే విదంగా నూడా చైర్మెన్ కేశ వేణు, రైతు సంక్షేమ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంధాలయ చేర్మెన్ అంత రెడ్డి రాజా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో కోశాధికారి బి గంగాధర్ రావు,ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, బోగ అశోక్, మాజీ అధ్యక్షులు బంటు రాజేశ్వర్,మాజీ కార్యదర్శి బద్దూరి బాలకృష్ణ,దిగంబర్ పవర్, గంగారెడ్డి,సంయుక్త కార్యదర్శిలు AS సాంబయ్య, పెంట దత్తాత్రి, సభ్యులు లక్కం రెడ్డి,అరేట్టి లక్ష్మి నారాయణ, మహమ్మద్ ఖాయ్యిమ్,ప్రతాప్ రుద్ర,ఆమంద్ విజయ్,పాటి అనిల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
