Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 6:35 pm Posted by : ramakrishna

కంటి వైద్య పరీక్షలలో అధునాతన టెక్నాలజీతో వైద్య సేవలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ లో నూతనంగా డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి అత్యధిక టెక్నాలజీతో నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణలోనే అగర్వాల్ కంటి ఆసుపత్రిలు 13 బ్రాంచీలు ఉన్నాయని అన్నారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల తో పాటు ఆఫ్రికన్ దేశాల్లో 200 కు పైగా తమ హాస్పిటల్లు ఉన్నాయన్నారు. అలాగే ఇక్కడ ఏలాంటి వారి కైనా కంటి పరీక్షలు చేసే పరికరాలు, అడ్వాన్స్ సిస్టం లు కలిగి ఉన్న ఈ హాస్పిటల్ లో అనుభవం కూడిన డాక్టర్లు ఉన్నారని చెప్పారు. అలాగే నూతనంగా ప్రారంభం జరిగినందుకు నిజాంబాద్ ప్రజలకు ఈనెల నుండి సెప్టెంబర్ 30 వరకు ఉచిత కంటి పరీక్షలు చేయబడుతుందన్నారు. తమ హాస్పిటల్ లో కంటి హాస్పిటల్లో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు
శ్రీకాంత్, డాక్టర్ శరత్ జోషి, డాక్టర్ శ్వేత గుప్తా రితి , వైద్య బృందం పాల్గొన్నారు.