Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 4:22 pm Posted by : ramakrishna

విద్యార్థులకు వైద్య పరీక్షలు

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలోని యుపిఎస్, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  డాక్టర్ అర్జున్ పిల్లలకు ఎత్తు, బరువు, కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలో పలు సూచనలు చేశారు. పాఠశాలలోని 60 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా నలుగురికి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఒకరికి చెవి సమస్య, దంతాల సమస్య, మరొకరికి చేతి సమస్య, మరో ఒక విద్యార్థి బరువు తక్కువ ఉండడంతో పలు సూచనలు ఇచ్చి వారికి ప్రభుత్వ ఆస్పత్రి బాన్సువాడ వరకు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ జెట్టీ, ఉపాధ్యాయులు విట్టల్ రావు, శ్యాంసుందర్ , శిల్ప, మరియు హెల్త్ సిబ్బంది సద్గుణ ,విష్ణు, తదితరులు పాల్గొన్నారు.