. . . కాలేజి ఫెస్ట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి వేడుకలు ఐదు రోజుల పాటు జరిగే వేడుకలకు ఈ సంవత్సరం ఎలీగ్జర్ 24 ఫెస్ట్ గా నామకరణం చేశారు. మొదటి రోజు ప్రారంభోత్సవ వేడుకలకు మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజర్ ను లాంచ్ చేసి మెడికల్ స్టాళ్ళను ప్రారంభించారు.

ఐదు రోజుల పాటు జరిగే వేడుకలకు సంబంధించిన టీషర్టులను కూడా ఆవిష్కరించారు. మెడికల్ కళాశాల స్థాపన కోసం ఆనాడు మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డిని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శివప్రసాద్, సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ప్రొఫెసర్లు నాగమోహన్, జలగం తిరుపతి, కళాశాల సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు తదితరులున్నారు.
