రాచూర్ లో వైద్య శిబిరం ఏర్పాటు : ఎమ్మెల్యే

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  తక్షణమే స్పందించి రాచూర్ గ్రామానికి వెళ్లారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే  గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, వెంటనే వైద్య అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు.  వైద్యుల బృందాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్యుల బృందం… అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి, వైద్యం అందించి, మందులు అందజేశారు. వైద్యుల...