బతుకమ్మ దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన శ్రీనల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహాప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు మధవనేని రఘునందన్ రావు పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తోగుట మండల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి విభిషన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి కంకణాల నర్సింలు, మండల ఉపాధ్యక్షులు స్వామిరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, కడారి నరేంద్ర, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బొడ్డు నర్సింలు, బెజుగమ ఆంజనేయులు, అత్మకూరి శ్రీకాంత్, బాల్ రాజు యాదవ్, రాజిరెడ్డి ,మన్నె శ్రీను ,తదితరలు పాల్గొన్నారు.
