జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపా ధ్యాయుడు టి.ఎల్.ఎన్ గౌడ్ కుమారుడు టి.ఆదిత్య గౌడు కు నీట్ లో మంచిర్యాం కుతో గవర్నమెంట్ సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదిం చాడు. మంచి ర్యాంకుతో ఎంబిబిఎస్ సీటు సంపాదించినందుకు శనివారం ప్రభుత్వ ఉపాధ్యాయులు కె.బాబు, మధుసూదన్, వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ చంద్ర కాంత్, నంగేవారు భూమయ్య, బస్వరాజ్ స్వామి, మాధ ప్రసాద్, అశోక్ లు టిఎల్ఎన్ గౌడ్ ను ఘనం గా సన్మానించడం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన జుక్కల్ నుంచి ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకుని ఎంబిబిఎస్ సీటు సాధించడం తమకు గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. మండల విద్యార్థులకు ఆదిత్య అధర్శం అన్నారు.