Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 6:02 pm Posted by : ramakrishna

ఆత్మకు శాంతి కలగాలని..

మెండోరా, బతుకమ్మ : నీటి పారుదల శాఖా బాల్కొండ డివిజన్,కమ్మర్ పల్లీ సబ్ డివిజన్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఇంజనీర్, నితిన్ దాల్వే,ఉద్యోగములో చేరిన 10 నెలలకే, ఆకస్మికంగా మరణించడం చాల బాధాకరం అని ప్రాజెక్ట్ ఎస్. ఈ శ్రీనివాస రావు గుప్తా అన్నారు. అతనీ మృతికి సంతాపం ప్రకటించిన శ్రీరాం సాగర్ పోచంపాడ్ డివిజన్, సర్కిల్ ఉద్యోగులు మంగళవారం కార్యాలయం ముందు రెండు నిమిషాలూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డి ఈఈ లు, ఏ ఈ ఈలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.