Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 1:49 pm Posted by : ramakrishna

సాయంత్రం ఉప్పల్ లో మ్యాచ్.. నల్ల రిబ్బన్లతో క్రీడాకారులు.. నో చీర్ లీడర్స్

పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన బీసీసీఐ

 హైదరాబాద్, బతుకమ్మ : పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. బుధవారం జరిగే హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో జరిగే మ్యాచ్ లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం ఆటగాళ్లు, అంపైర్లు పాటించనున్నారు.  పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపనుంది. ఈమ్యాచ్లో చీర్ లీడర్స్ అనుమతి లేదు. ఒక నిమిషం పాటు ప్రేక్షకులతో పాటు అందరూ మౌనం పాటించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.