. . . పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన నయారా ఎనర్జీ
వెబ్ డెస్క్, బతుకమ్మ:
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్రం భారీగా తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్( 19 కేజీల) ధరను రూ.183 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఎల్పిజి ధరలు తగ్గడంతో రూ.3113 గా ఉన్న సిలిండర్ ధర రూ.2930 కి లభించనుంది. గత నెల 29న కేంద్రం హోటళ్లు, రెస్టారెంట్ల కు కమర్షియల్ సిలిండర్ సరఫరాపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ఇంధన రంగ సంస్థ నయారా ఎనర్జీ కూడా పెట్రోల్ పై లీటర్ కు రూ.5, డీజిల్ పై రూ.3 ధరలు తగ్గించింది..
