రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రోజున సాయంత్రం 6 నుండి 12 గంటల వరకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పద్మ ప్రదీప్ గురుస్వామి, శ్యామ్ స్వామి, పత్తి రాము స్వాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాలధారులు, హిందూ బంధువులందరూ ఈ శబరి గిరీష అయ్యప్ప స్వామి మహా పడి పూజను చూసిన వారికి పుణ్యం కలుగునని తెలిపారు. అయ్యప్ప స్వామి మహా పడిపూజకు పెద్ద ఎత్తున తరలిరావాలని పేర్కొన్నారు.