- మార్కెట్ సిబ్బంది నిరసన
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లా మార్కెట్ కమిటీ సెక్రటరీ పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ అహంకార ధోరణితో ఉద్యోగిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.