లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో కన్నాపూర్ గ్రామనికి చెందిన రమేష్, రవి, దేవసోత్ దేవ్, జింక భూమయ్య, ఒడ్డే మైసాయా, శ్రీను, గారబోయిన సత్యయా, యాదగిరి, చిన్న గిరితో పాటు వివిధ పార్టీ కార్యకర్తలు సుమారు 20 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోకల సాయిరాం, జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జైల్ సింగ్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బ్యాగరి సాయిలు, పరందములు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.