మనుస్మృతి దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మాల సంక్షేమ సంఘం గంగస్థాన్ -2 ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మనుస్మృతి దహనం చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మక్కం గంగాధర్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్, జాయింట్ సెక్రెటరీ నీరడి సాయిలు, కోశాధికారి సర్కాని ఉలియా, బొడ్డు లక్ష్మణ్, తుక్కడినారాయణ, మేకల అశోక్ అంబేద్కర్ కాలనీవాసులు పాల్గొన్నారు.