Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 9:51 pm Posted by : ramakrishna

అన్ని వర్గాల అభివృద్ధి కోరే నేత మంద కృష్ణ మాదిగ 

  • ఎమ్మార్పీయస్ మండల్ ప్రెసిడెంట్ గడాల ప్రసాద్ 

 

భీమ్ గల్, బతుకమ్మ  : సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే ప్రజా నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అని భీమ్ గల్ మండల ఎమ్మార్పీయస్ ప్రెసిడెంట్ గడాల ప్రసాద్ అన్నారు. ఎమ్మార్పీయస్ వ్యవస్థపకులు మంద కృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని జాగీర్యాల గ్రామంలో కేక్ కట్ చేసి, మంద కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ సామాజిక ఉద్యమకారుడని, ఆరోగ్య శ్రీ, వికలాంగుల, వితంతు పెన్షనల్ ల ఉపకర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కార్యక్రమం లో ఎమ్మార్పీయస్ నాయకులు మహేష్, గోపి, రాజరాం, జలపతి, గంగాధర్, రాజు, చింటూ, ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.