రుద్రంగి, బతుకమ్మ :
రుద్రంగి మండలం మాల గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాలత్ అరవింద్ కి 53000, గుగులోతు గంగాధర్ కి 25000, భూక్య సతీష్ కి 18500, పుప్పాల గంగాధర్ కి 60000, మాలోత్ శంకర్ కి 60000 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులు మంజూరు చేయించిన మానాల మోహన్ రెడ్డి కి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ ఆది శ్రీనుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైడ్ ఏఈడి లక్ష్మణ్, ఉప సర్పంచ్ దాసర అశోక్, తూమ్ జలపతి, జక్కు మోహన్, కొండ రాజేందర్,జక్కు వంశీ, జూల దిలీప్, కొమ్ముల రవీందర్, లక్కాకుల శ్రీనివాస్, జక్కు లింగారెడ్డి, జక్కుల లక్ష్మీ, నరసయ్య, పండుగ గంగాధర్, తిక్క భూమయ్య, ఇండ్ల లక్ష్మయ్య, క్యాతం పెద్ద గంగాధర్, లకావత్ బాలు, చెదలు నవీన్, ఉమ్మడి మానాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.