. . . 21 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 22 మందిని పట్టుకున్నట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి. ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 21 మందికి ఒకరికి 10,000/- చొప్పున 210,000/-జరిమానా విదించి ఉత్తం పరశురాం అనే వ్యక్తికి మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు పేర్కొన్నారు. వాహనాదారులు మద్యం సేవించి వాహానాలు నడపకూడదని ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ హెచ్చరించారు.