. . . కారులో వచ్చి కత్తితో నరికి హత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని శివాజినగర్ లో దారుణం జరిగింది. పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా ఉన్న గిరిరాజ్ అపార్ట్ మెంట్ వద్ద ఉన్న పానీపూరి బండి వద్ద ఉన్న వ్యక్తిపై కారులో వచ్చిన ముగ్గురు కొబ్బరిబొండలు నరికే కత్తితో దాడి చేసి హతమార్చారు. ప్రజలందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య కలకలం రేపింది. హతుడెవరు, హంతకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. స్థానిక 2వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా సీసీటీవీ పుటేజిలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నగరంలో పట్టపగలు జరిగిన హత్యతో జనాలు ఉలిక్కిపడ్డారు.